చెన్నై: ఐపీఎల్లో ధోనీని, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ను వేరు చేసి చూడలేం. అంతలా అతను ఆ టీమ్తో కలిసిపోయాడు. చెన్నై ఆడిన ఎనిమిది సీజన్లలోనూ ఆ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పుడు రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్లోకి వచ్చిన చెన్నై టీమ్.. మరో ఆలోచన లేకుండా రిటెన్షన్ పాలసీలో ధోనీని తీసుకున్నది. అయితే తమ ఇద్దరి మధ్య బంధంపై తాజాగా ధోనీ స్పందించాడు. అసలు ఐపీఎల్లో చెన్నైకి తప్ప మరో టీమ్కు ఆడబోనని అతను స్పష్టంచేశాడు. రెండేళ్ల నిషేధం సమయంలో పుణె టీమ్కు ఆడిన ధోనీ కూడా.. ఇప్పుడు మళ్లీ చెన్నైకి తిరిగి రావడంతో తెగ ఆనంద పడుతున్నాడు. నిజానికి ప్లేయర్ రిటెన్షన్కు ముందు కూడా చాలా టీమ్స్ తనను సంప్రదించాయని, కానీ తాను మాత్రం చెన్నై కాకుండా మరో టీమ్ గురించి ఆలోచించలేదని ధోనీ చెప్పాడు. చెన్నై టీమ్, అక్కడి అభిమానులు తనపై చూపించిన అభిమానంపై కూడా ధోనీ స్పందించాడు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన ప్రదేశం. మరో ఫ్రాంచైజీతో వెళ్లడం అన్న ప్రశ్నే లేదు అని ధోనీ చెప్పాడు. ధోనీతోపాటు రైనా, జడేజాలను చెన్నై టీమ్ తమతోపాటు కొనసాగించిన విషయం తెలిసిందే. కెప్టెన్గా చెన్నై టీమ్ను ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ధోనీ నిలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm