హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ పదవికి రాజారపు ప్రతాప్ శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ పదవికి రాజీనామా చేశానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిపే రాజీనామా చేశానన్నారు. కాగా... మైనార్టీ కమిషన్ నూతన వైస్ చైర్మన్గా శంకర్ను ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోపు ఉత్తర్వులు వెలువడే అవకాశముందని సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm