వరంగల్ రూరల్: జిల్లాలోని శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పర్యటిస్తున్నారు. గ్రామ ప్రజలతో సమావేశమైన స్పీకర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక విద్యార్థులతో ముచ్చటించిన స్పీకర్ నేను చదువుకుంటునే స్పీకర్ అయ్యానని చెబుతూనే అప్పటి విద్య వ్యవస్థతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితులను ఆయన వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm