వరంగల్: ఓ ప్రేమజంట ఆత్మహత్య వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. దుగ్గొండి మండలం రేకంపల్లికి చెందిన భరత్(25), ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన షేక్ నజీమా(23)లు నర్సంపేటలోని ఓప్రైవేట్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లో పనిచేసేవారు. ఈ సందర్బంగా ఏర్పడ్డ పరిచయం చివరకు ప్రేమ వరకూ వెళ్లింది. అయితే... ఇరువురు తమ ప్రేమ వ్యవహారాన్ని తమ పెద్దలకు తెలిపి పెళ్లి చేయాలని కోరారు. కాగా... భరత్కు నజీమాను ఇవ్వడం ఇష్టంలేని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే సంబంధం చూశారు. దీంతో ప్రేమికులిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని భావించి ఈనెల 15న ఇనిస్టిట్యూట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున వారు మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm