వనపర్తి: జిల్లాలోని వీపనగుండ్ల మండలం దీపలదిన్నే గ్రామపంచాయతీ పరిధిలో రంగవరం గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. గ్రామాన్ని నూతన గ్రామపంచాతీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అర్హత ఉన్న గ్రామాలన్నింటిని పంచాయితీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో మాజీ సర్పంచ్ గోపాల్రెడ్డి కుమారుడు శ్యామ్సుందర్రెడ్డి గుండెపోటుతో మరణించాడు. ఆయన పార్థీవ దేహానికి మంత్రి జూపలి కృష్ణారావు నివాళులర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm