హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఇండియాటుడే సదస్సులో చాలా అందంగా అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సదస్సుపై స్పందించిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 4,200 మంది రైతులు చనిపోతే ఆ ప్రస్తావనే లేదని విమర్శించారు. ఎవరో తలకుమాసిన మలేషియా మంత్రి చెబితే రాష్ట్ర సచివాలయం కూల్చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి లేదని సీఎం నమ్మితే...కేసీఆర్ను లోక్పాల్ పరిధిలోకి తేవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. మద్యం షాపుల పర్మిట్ రూంలకు జై తెలంగాణ బోర్డులు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రూ.90 వేల కోట్లు అప్పు చేశారని, తెలంగాణలో నకిలీ పత్తి విత్తనాలు పంపిణీ అవుతున్నాయని శ్రవణ్ ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm