న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధవన్ను పాక్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. గత బుధవారం న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వచ్చి షోయబ్ మాలిక్ తలకు బలంగా తాకింది. దీంతో మాలిక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలిసిన ధవన్ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ మంచి చెడ్డలు వాకబు చేశాడు. తాను తొందరగా కోలుకుంటానని, అల్లా తనను కాపాడతాడని షోయబ్ ట్వీట్ చేశాడు. దీనికి శిఖర్ ధవన్ బదులిస్తూ షోయబ్ తొందరగా కోలుకుని పిచ్లో అడుగుపెట్టాలని ఆకాంక్షించాడు. జాగ్రత్తలు కూడా చెప్పాడు. ఈ ఒక్క ట్వీట్తో ధవన్ పాక్ అభిమానుల మనసులు గెలుకున్నాడు. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'మీరు గ్రేట్ సర్' అని ఒకరంటే 'లవ్యూ ధవన్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm