హైదరాబాద్ : ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి, ఆపై భవనంపై నుంచి తోసేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఎముకలు విరిగిపోయాయని వైద్యులు చెప్పారు. ఈ ఘటన గర్ముక్తేశ్వర్ ఆలయ ప్రాంతంలో చోటు చేసుకుందని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ను నిషేధించిన తరువాత కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm