హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను ప్రకటించింది. జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 400, తెలంగాణలో 255 ఖాళీలు ఉన్నాయి. ఎస్బీఐ ఆన్లైన్లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. విద్యార్హత కింద ఏదైనా డిగ్రీ ఉండాలి. అభ్యర్థులకు జనవరి 1, 2018 నాటికి 20-28ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపుల వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లో మైనస్ మార్కులు ఉంటాయి. ప్రతీ తప్పునకు పావుశాతం చొప్పున మార్కుల కోత ఉంటుంది. జనవరి 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 10తో గడువు ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్షలు మార్చి/ఏప్రిల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ మే 12న నిర్వహించడం జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm