హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి మొదలయ్యే పులులు ఇతర జంతువుల గణనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ అడవుల్లో జంతువులు, వృక్షజాతుల తాజా పరిస్థితి నమోదుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్ పర్యావరణహిత చర్యలకు ఈ సర్వేనే ఆధారం కానుంది. సర్వేలో అటవీశాఖ సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm