చెన్నై : మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని భర్తను భార్య కత్తిపీటతో నరికి చంపింన ఘటన గురువారం తోండమాదూరులో చోటుచేసుకుంది. సెల్వరాజ్ కొన్ని సంవత్సరాలుగా చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను తరచూ మద్యం తాగి భార్యను లైంగికంగా వేధించేవాడు. చర్మవ్యాధి ఉన్న సెల్వరాజ్కు లూర్థుమేరి దూరంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో తరచూ దంపతుల మధ్య తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సెల్వరాజ్ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను లైంగికంగా వేధించాడు. దీనికి ఆగ్రహించిన లూర్థుమేరి కత్తిపీటతో సెల్వరాజ్ని నరికింది. ఈ దాడిలో సెల్వరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లూర్థుమేరి అరుమ్బావూర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పెరంబలూరు జిల్లా వేప్పందట్ట సమీపం తోండమాదూరు గ్రామానికి చెందిన సెల్వరాజ్ (48) రైతు. ఇతని భార్య లూర్థుమేరి (43). వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm