న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమానికి తగిన సూచనలు అందించాలని ఇచ్చిన పిలుపుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీకి రాహుల్ కొన్ని సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా మోదీకి మూడు అంశాలను ప్రతిపాదించారు. 2018 సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్' కార్యక్రమం జనవరి 28న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి దేశ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోడీ కోరారు. దీనికి స్పందించిన రాహుల్ తన ట్విట్టర్లో ఈ విధంగా రాసుకొచ్చారు. 'డియర్ నరేంద్ర మోడీ, మీ మన్ కీ బాత్ ప్రకటన చూసి మిమ్మల్ని కొన్ని ఆలోచించమని కోరుతున్నాను. మన యువతకు ఉద్యోగాలు ఇప్పించడం, చైనాతో డోక్లామ్ సమస్య పరిష్కారం, హర్యానాలో అత్యాచారాల్ని ఆపివేయడం గురించి మాట్లాడాతారని ఆశిస్తున్నాను' అని రాహుల్ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm