హైదరాబాద్: తనపై కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై పెట్టిన పోలీస్ కేసును ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, పవన్ ఫ్యాన్స్ కు, మహేష్ కు మధ్య నెలకొన్న వివాదం ముగిసిపోయినట్టే అని అందరూ భావిస్తున్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని జనసేన కార్యాలయం నుంచి కూడా అధికారికంగా సందేశం వచ్చింది. అంతేకాదు, ఫిలిం నగర్ లో నిన్న రాత్రి కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ పార్టీ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కత్తి మహేష్ తాజాగా మరో ట్వీట్ చేశారు. తన పోరాటమంతా నిర్భయంగా మన అభిప్రాయాలను వెల్లడించే హక్కును కాపాడుకోవడానికే అని ట్విట్టర్ లో తెలిపారు. ఆ హక్కును సరెండర్ చేస్తున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని చెప్పారు. తాను సైలెంట్ గా కూర్చోవాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యక్తులను టార్గెట్ చేయబోనని... అయితే విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి తన అభిప్రాయాలను మాత్రం ఎప్పటిలానే ముక్కుసూటిగా వెల్లడిస్తూనే ఉంటానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 20,2018 10:34AM