భివాండి: వరుస అగ్నిప్రమాదాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. థానేలోని బివాండీలో ఉన్న బాబ్లా కౌంపౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్టు స్థానికులు శనివారంనాడు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో ఐదుగురు కార్మికులు నిద్రిస్తున్నారు. అనంతరం వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటానా స్థలికి చేరుకున్నామని, గంటలోపే మంటలు అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక సిబ్బంది జగదీష్ సబ్రె తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm