శ్రీనగర్: పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ మరోసారి శనివారంనాడు జమ్మూకశ్మీర్లోని సరహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. ఆర్ఎస్ పుర, అఖ్నూర్ సెక్టార్లలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరుపుతోంది. ఈ దాడులను భారత సైనిక బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. సరిహద్దు ఔట్ పోస్టులు, జనావాసాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా మూడోరోజు పాకిస్థాన్ రేంజర్లు తూటాల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారంనాడు జమ్మూకశ్మీర్లోని పలు ఏరియాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో 11 మంది పౌరులు గాయపడ్డారు. రాంగఢ్ ఏరియాలో ఇద్దరు పౌరులు, హిరానగర్ సెక్టార్లో ఐదుగురు, ఆర్ఎస్ పుర సెక్టార్లో నలుగురు పౌరులు గాయపడ్డారు. దీంతో బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం భారీ స్థాయిలో ప్రతిదాడులు జరుపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm