సహ్రాన్పూర్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు కుర్రాళ్లు నడిరోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోని దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సహ్రాన్పూర్లో జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తమ వాహనంలో రక్తపు మరకలు అవుతాయన్న కారణంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అలాగే చూస్తుండిపోయారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన పోలీసులు ఏమాత్రం మానవత్వం లేకుండా దారుణంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.
17ఏళ్ల వయసున్న ఇద్దరు కుర్రాళ్లు అర్పిత్, సన్నీ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై రోడ్డుపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న కొందరు అక్కడ గుమిగూడి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. బాధితులను వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లమని పోలీసులను స్థానికులు ఎంతగానో వేడుకున్నారు. కానీ వారు ఏమాత్రం చలించలేదు. కొంచెమైనా కనికరం లేకుండా కర్కశంగా మాట్లాడారు. మా వాహనంలో రక్తపు మరకలు అవుతాయని అన్నారు. స్థానికులు పోలీసులను వేడుకుంటుండగా ఎవరో వీడియో తీశారు. వీడియోలో పోలీసుల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. స్థానికులు ఎవ్వరికీ కారు లేదు దయచేసి తీసుకెళ్లండి అని మరో వ్యక్తి అభ్యర్థించారు. ఇలా పదే పదే వారిని కోరారు. మరో ఇద్దరు వచ్చే పోయే వాహనాలు ఆపడానికి ప్రయత్నించారు.. కానీ ఒక్కరూ ఆపలేదు. ఃమీ వాహనమైతే కడుక్కోవచ్చు.. కాదా.. అని మరో వ్యక్తి అడిగాడు. అయినా ఏమాత్రం చలించలేదు. దీనికి పోలీసులు.. కారు కడుగొచ్చు కానీ రాత్రంతా మేము ఎక్కడ కూర్చోవాలి అని కర్కశంగా సమాధానమిచ్చారు. కొద్దిసేపటికి స్థానిక పోలీస్స్టేషన్ నుంచి మరో వాహనం వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో పోలీసుల ప్రవర్తన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మూడు నిమిషాల వీడియోలో వారి ప్రవర్తన ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీనిపై సహ్రాన్పూర్ పోలీస్ చీఫ్ ప్రబల్ ప్రతాప్ సింగ్ స్పందిస్తూ..ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 20,2018 11:33AM