హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 63 వేలు, డిజిటల్ స్కానర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకులు.. డిజిటల్ స్కానర్తో పేకాటలో మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్ఫోన్ డిజిటల్ స్కానర్తో నిందితుడు ప్రవీణ్ మోసం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ డిజిటల్ స్కానర్ను ఢిల్లీలో కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ స్కానర్ పేకాటలో ఎవరు గెలుస్తారో ముందే పసిగట్టేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm