చెన్నై: దాదాపు ఆరేళ్ల తర్వాత తమిళనాడులో బస్సు ఛార్జీలు పెరిగాయి. ఊహించని రీతిలో 67 శాతం పెంచి రవాణా శాఖ పెద్ద షాకే ఇచ్చింది. కాగా, శనివారం నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. చెన్నై నగర పరిధిలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ కనిష్ఠ ధరను 5 రూపాయలుగా నిర్ణయించింది. ఇంతకు ముందు అది 3 రూపాయలుగా ఉండేది. గరిష్ఠ ధరను 14-23 రూపాయలుగా సవరించింది. నాన్-మెట్రో ఛార్జీల విషయంలో 3రూ. నుంచి 5. రూలకు పెంచి.. గరిష్ఠ ధరను 12 నుంచి 19 రూపాయలకు సవరిచింది. గ్రామీణ సర్వీసులు, ఆర్టీనరీ సర్వీసులపై మినమిమ్ టికెట్ ధరను ఒక రూపాయి పెంచి 6 రూ. గా నిర్ణయించింది. ఎక్స్ ప్రెస్ బస్సుల మినిమమ్ టికెట్ ధరను 17 నుంచి 24 రూ. లకు పెంచేసింది. నాన్-స్టాప్ డీలక్స్ బస్సులపై 18 నుంచి 27 రూ., అల్ట్రా డీలక్స్ బస్సుల ధరను 21 నుంచి 33 రూపాయలకు పెంచేసింది.
Mon Jan 19, 2015 06:51 pm