హైదరాబాద్ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.186 కే ఓ సరికొత్త ప్లాన్ను తాజాగా లాంచ్ చేసింది. ఈ ప్లాన్ను రీచార్జి చేసుకుంటే దాంతో వినియోగదారులకు 28 రోజుల వాలిడిటీతో రోజుకు 1జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ కూడా వస్తాయి. ఈ క్రమంలో 28 రోజులకు గాను వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా చొప్పున మొత్తం 28జీబీ డేటా ఉచితంగా వస్తుంది. ఇటీవలి కాలంలో ఎయిర్టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ తదితర ఇతర టెలికాం సంస్థలు రూ.200 లోపే 28 రోజుల వాలిడిటీ కలిగిన ప్లాన్లను విడుదల చేయగా తాజాగా బీఎస్ఎన్ఎల్ తన రూ.186 ప్లాన్తో ఈ జాబితాలోకి వచ్చి చేరింది..!
Mon Jan 19, 2015 06:51 pm