సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజం ఒక్కటౌతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్(ఎస్) మండలంలోని నశింపేట, ఏపూరు గ్రామాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీష్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేతలకు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందన్నారు. మారుమూల గ్రామాలకు, తండాలకు సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆత్మకూర్(ఎస్) మండలం పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ పనులు 80 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm