ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇంఫాల్కు ఎయిరిండియా విమానంలో సీఎం బీరేన్ సింగ్.. శుక్రవారం మధ్యాహ్నం బయల్దేరారు. అసోం రాజధాని గుహవాటిలోని లోక్ప్రియ గోపినాథ్ బర్డోలి ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా దాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం స్వల్పంగా దెబ్బతింది. మొత్తానికి పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. సీఎం సింగ్తో పాటు 160 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ఎయిరిండియా యాజమాన్యం స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm