జమ్మూకశ్మీర్ : పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. ఆర్ఎస్ పురా సెక్టార్, కిృష్ణ ఘాటి సెక్టార్లో శనివారం ఉదయం నుంచి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. వరుసగా మూడో రోజు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఘాటి సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరపడంతో జవాను మన్దీప్ సింగ్(23) ప్రాణాలు కోల్పోయాడు. సింగ్ స్వస్థలం పంజాబ్లోని అలంపూర్ గ్రామం. ఆర్ఎస్ పురా సెక్టార్లో జరిపిన పాక్ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో బీఎస్ఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. పాక్ రేంజర్లు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ.. మోర్టార్ సెల్స్తో సరిహద్దు గ్రామాలపై దాడి చేశారు. శుక్రవారం పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను, ఇండియన్ ఆర్మీ సోల్జర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. సుమారు 11 మంది సాధారణ ప్రజలు గాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm