జమ్మూకశ్మీర్ : సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పాక్ రేంజర్ల కాల్పులకు అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మోర్టార్ షెల్స్ ధాటికి ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. పిల్లలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. బాలకోట్, మాన్కోట్ ప్రాంతాల్లోని 120 పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా అభివృద్ధి అధికారి ప్రకటించారు. పాక్ కాల్పుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఒక జవాను, ఇద్దరు పౌరులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm