హైదరాబాద్: తనకు ప్రాణహాని ఉందని ప్రజాయుద్ధనౌక గద్దర్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. తనపై కాల్పులు జరిగి 20 ఏళ్లయినా విచారణ జరపలేదన్నారు. కాల్పుల ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశానని.. కాల్పుల ఘటనపై రాష్ట్రపతి విచారణ జరపాలని చెప్పారని పేర్కొన్నారు. దానికి సంబంధించి లేఖ ప్రతులను హోంమంత్రికి అందించానని గద్దర్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm