చిత్తూరు: భూమిపై స్థలం లేకుంటే సముద్రంలో కూడా మద్యం దుకాణం పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖలో తహసీల్దార్, ఆర్అండ్బీ ఈఎన్సీపై ఏసీబీ సోదాలు జరిపించానని, వందల కోట్ల అవినీతి సొమ్మును జప్తు చేయించానని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు పగటి పూటే 10 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 10లక్షల ఐటీ ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అవినీతి, రౌడీయిజం వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm