కర్నూలు : నగరంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం పదేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. స్థానిక వీకర్ సెక్షన్లోని మున్సిపల్ పార్కులోని సంపులో పడి పదేళ్ల బాలుడు తిరుమలేశు మృతి చెందాడు. సంపు పైన ఎలాంటి మూత లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమంటున్న బంధువులు... న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm