న్యూ ఢిల్లీ: ఏపీతో తమకు పోటీ లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కియా, ఏషియన్ పెయింట్స్ సహా చాలా ప్రముఖ సంస్థలు ఏపీకి వచ్చాయని గుర్తుచేశారు. శనివారం ఢిల్లీలో పర్యటించిన మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి తోమర్ను కలిశారు. పెండింగ్ ఉపాధి బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఉపాధి హామీతో గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలపై నివేదికను కేంద్రమంత్రికి అందజేశారు. విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల సమావేశం నిర్వహించాలని సూచించారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు లోకేష్ తెలిపారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్.. ఆధార్ అనుసంధానంతో పథకాల్లో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. నెల రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm