హైదరాబాద్: టీడీపీని టీఆర్ఎ్సలో విలీనం చేయాలన్న వ్యాఖ్యలపై పొలిట్బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు నుంచి వివరణ కోరాలని టీడీపీటీఎస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్భవన్లో శనివారం టీడీపీటీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన పొలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుల సమావేశంలో మోత్కుపల్లి వ్యాఖ్యలు-పార్టీలో పరిణామాలు, శిక్షణ తరగతులు, పల్లెపల్లెకు తెలుగుదేశం అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18 నుంచి పార్టీలో జరిగిన సంఘటనలపై కేంద్రకమిటీకి నివేదిక ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm