సికింద్రాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహ సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ ఆర్మీ జవాన్ కూతురిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాడ్డుతో కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే... స్పృహ కోల్పోయి ఉన్న బాలికను స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారమందించారు. ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగింది. కాగా... ఈ దారుణానికి పాల్పడ్డ వారిని ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేదని సమాచారం. అంతేగాకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm