హైదరాబాద్: మార్నింగ్వాక్కి వెళ్లిన ఓ వ్యక్తిని వీధికుక్క ఢీకొని శనివారం మృతి చెందాడు. ఎస్సై రాములు వివరాల ప్రకారం జవహర్నగర్ పరిధిలోని కౌకూర్కు చెందిన నర్సింగరావు(64) శనివారం ఉదయం స్థానిక ప్రధాన రహదారిపై వాక్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చిన వీధికుక్క నర్సింగరావును ఢీకొట్టడంతో అతడు అక్కడే కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అతన్ని కుటుంబీకులు వచ్చి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న క్రమంలోనే అతడు మృతి చెందాడు. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కౌకూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కూమారుడు నిమ్మ చందర్ ఫిర్యాధు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm