ప్లోరిడాలోని పార్క్లాండ్ హైస్కూల్ విద్యార్థులపై 17 ఏళ్ల నికోలస్ క్రూజ్ ఇటీవల విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై తన కోపాన్ని వెళ్లగక్కింది. శక్తిమంతమైన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ)తో సంబంధాలు ఉన్నందుకు ఎమ్మా గొంజాలెజ్ అనే విద్యార్థిని దేశ రాజకీయ నేతలను తీవ్రంగా విమర్శించింది.
ఎన్ఆర్ఏ నుండి విరాళాలు స్వీకరించే ప్రతి రాజకీయ నేతను చూసి సిగ్గుపడుతున్నానుఁ అని ఆ బాలిక పేర్కొంది. కాల్పుల ఘటనను నిరసిస్తూ ఫ్లోరిడాలో శనివారం చేపట్టిన తుపాకీ వ్యతిరేక ర్యాలీలో ఆమె పాల్గొంది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం ఎన్ఆర్ఏ నుండి లక్షలాది డాలర్లు విరాళంగా తీసుకున్నారంటూ బాలికతో పాటు ర్యాలీలో పాల్గొన్న వారు తీవ్రంగా ఆరోపించారు. ఎన్ఆర్ఏ నుంచి రాజకీయ నేతలు విరాళాలు తీసుకోవడం ఃసిగ్గు చేటు...సిగ్గుచేటుః అంటూ గొంజాలెజ్తో పాటు వారంతా శ్రుతి కలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 03:41PM