చెన్నైః రాజకీయాల్లోనూ చేతులు కలపబోతున్నారన్న వార్తల మధ్య ఇవాళ ఇద్దరు తమిళ సూపర్స్టార్లు సమావేశమయ్యారు. తన రాజకీయ యాత్ర గురించి రజనీతో చర్చించడానికి కమల్హాసన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ నెల 21న పార్టీని ప్రారంభించనున్న కమల్.. ఆ తర్వాత తాను చేపట్టబోయే యాత్రపై రజనీతో చర్చించారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదని, ఓ శ్రేయోభిలాషిగా మాత్రమే రజనీని కలిశానని కమల్ చెప్పాడు. రాష్ట్రంలో యాత్ర చేపట్టాలని అనుకుంటున్నట్లు రజనీతో చెప్పాను. యాత్ర మొదలుపెట్టే ముందు నాకు నచ్చిన వ్యక్తులను కలుస్తున్నాను. స్నేహితుడిగానే రజనీని కలిశాను తప్ప అందులో రాజకీయ కోణం లేదు అని కమల్ స్పష్టంచేశాడు. మరి భవిష్యత్తులోనైనా రజనీతో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కాలమే సమాధానం చెప్పాలని అని కమల్ అన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm