అగర్తల: సమయం మించిపోయినప్పటికీ త్రిపురలో ఇంకా ఎన్నికల పోలింగ్ కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. దీంతో ఓటర్లు వెనక్కి వెళ్లిపోయారు. అధికారులు వాటిని మార్చడంతో మళ్లీ పలు ప్రాంతాల్లో సుమారు 11.30గం. పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగాను 59 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ 4గం. ముగియాల్సి ఉండగా.. పోలింగ్ బూత్ల ఎదుట భారీగా ఓటర్లు ఉండటంతో ఆరు గంటల వరకు పొడిగించారు. నాలుగు గంటల సమయానికి 74శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm