ఒంగోలు: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ అధినేత చిందులు తొక్కారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్సీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ)తో రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుందని జగన్ విమర్శించారు.
పవన్ కల్యాణ్ కోరినట్లు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉందని, టీడీపీ కూడా కలిసి రావాలని జగన్ అన్నారు. ఃఃపవన్ కల్యాణ్ గారూ.. మీరు చెప్పినట్లే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా.. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడుగారితో మాట్లాడండి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అంటే దానికి 54మంది ఎంపీల మద్దతు కావాలి. మావాళ్లు 5మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్లు మీ చంద్రబాబు వద్ద ఉన్నారు.
అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా ఒకే.. లేదా మీరు పెట్టినా మద్దతివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం.ఃః అని పవన్ను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 07:00PM