జొహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా జరుగుతున్న తొలి టీ-20లో తొలుత బ్యాటింగ్కి భారత రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆరంభలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(21), సురేష్ రైనా(15)లు గ్రౌండ్లో మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరారు. ఈ దశలో మరో ఓపెనర్ శిఖర్ ధవన్, కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి చెలరేగి ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కి 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. షంషీ వేసిన 10వ ఓవర్ 3వ బంతికి విరాట్(26) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత ధవన్ తన వేగాన్ని పెంచాడు. 39 బంతుల్లో 72 పరుగులు చేసి పెహ్లుక్వాయో బౌలింగ్లో కీపర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్లో మనీష్(20), ధోని(2) ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm