జొహానెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (43బీ 23 బంతుల్లో 5ఐ4, 2ఐ6) చక్కగా ఆడుతున్నాడు. అద్భుతమైన షాట్లతో అలరిస్తున్నాడు. వేగంగా ఆడుతున్నాడు. మనీశ్ పాండే (1బీ 1 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు షంషి వేసిన 9.3వ బంతికి సారథి విరాట్ కోహ్లీ (26బీ 20 బంతుల్లో 2ఐ4, 1ఐ6) వికెట్ల ముందు దొరికిపోయాడు. కోహ్లీ బ్యాట్ నుంచి తప్పించుకున్న బంతికి అతడి ప్యాడ్లకు తాకింది.
Mon Jan 19, 2015 06:51 pm