న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మేయర్, బీజేపీ నేత ప్రీతి అగర్వాల్ షాకిచ్చారు. తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్, ఆప్ ఢిల్లీ కన్వీనర్ దిలీప్ పాండేలకు లీగల్ నోటీసులు పంపారు. టెండర్లలో అగర్వాల్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో దర్యాప్తు కోసం నియమించిన కమిటీపై అగర్వాల్ ఒత్తిడి తీసుకొచ్చి దర్యాప్తును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్న ఆప్.. అగర్వాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆప్ ఆరోపణలను మేయర్ కొట్టిపడేశారు. మీడియా సమావేశంలో తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ఆప్ నేతలు ప్రయత్నించారని అగర్వాల్ ఆరోపించారు. తనను అవినీతిపరురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో తాను చులకన అయ్యానని, తన పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ లీగల్ నోటీసులు పంపించారు.
మేయర్గా ఎన్నికైన ప్రీతి అగర్వాల్ ఏడాదిలోనే తీవ్రమైన అవినీతి అరోపణల్లో చిక్కుకున్నారు. పలు టెండర్లు, మందుల కొనుగోలు కాంట్రాక్టులలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు జరుపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 07:46PM