కడప : కడప జిల్లా ఒంటి మిట్ట మండలం చెర్లోపల్లి గ్రామ చెరువులో 5 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతులు ఎవరన్నదీ ఇంకా తెలీలేదు.
వీరంతా ఎర్రచందనం కోసం వచ్చిన కూలీలుగా స్థానిక మీడియా ప్రతినిధులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎర్రచందనం కోసం వచ్చి పోలీసుల నుంచి తప్పించుకోవడానికే చెరువులోకి దిగారని స్థానిక జర్నలిస్టు ఒకరు బీబీసీకి తెలిపారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం..
శుక్రవారం రాత్రి 8-9 గంటల మధ్య పోలీసులు కడప-రేణిగుంట రహదారిలో వెళుతున్నారు. ఆ సమయంలో రోడ్డుపై ఓ లారీని ఆపి, కొందరు వ్యక్తులు బ్యాగులు తీసుకుని హడావుడిగా లారీ దిగుతున్నారు. పోలీసులను చూసి.. లారీ నుంచి దిగినవారు చీకట్లోనే పరారయ్యారు.
వారిని వెంబడించేందుకు పోలీసులు ప్రయత్నించినా, ఆ చీకట్లో వారి జాడ తెలియరాలేదు. ఆ ప్రాంతంలో చుట్టూ కొండలు ఉండటంతో, వారు ఆ కొండల్లోకి పారిపోయి ఉంటారని అనుమానించి పోలీసులు వెనుతిరిగారని స్థానిక జర్నలిస్టు బీబీసీకి వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 08:06PM