జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ాగబ్బర్్ణ శిఖర్ ధావన్ (72బీ 39 బంతుల్లో 10ఐ4, 2ఐ6) తాండవం ఆడాడు. అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డాడు. తెరపి లేకుండా వర్షం పడ్డట్టు ఒకటే బౌండరీలు వాన కురిపించాడు. అతడికి కోహ్లీ, మనీశ్ తోడవ్వడంతో భారత్ భారీ స్కోరు చేసింది. సఫారీలకు 204 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. చివరి నాలుగు టీ20ల్లో ఇక్కడ ఛేదనకు దిగిన జట్టే విజయం సాధించింది. అంటే చురకత్తుల్లాంటి బంతులు విసిరి ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే గానీ ఈ స్కోరును కాపాడుకోవడం కొంచెం కష్టమే!
Mon Jan 19, 2015 06:51 pm