పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే మోటార్బైక్ అంబులెన్స్ సేవలను గోవాలో అధికారికంగా నేడు ప్రారంభించారు. తీరప్రాంత పరిసరాల్లో ప్రమాదాలు ఎక్కవగా జరుగుతోన్న నేపథ్యంలో వెంటనే స్పందించే విధంగా 20 మోటార్ బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పారికర్ వెల్లడించారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా కావాల్సిన వైద్య సామగ్రి, ఆక్సిజన్ సిలిండర్లు ఈ మోటార్ అంబులెన్స్లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటే రద్దీ సమయాల్లో సైతం ఘటనా స్థలానికి తొందరగా చేరుకునేందుకు అవకాశం ఉన్నందున మొదటి ప్రాధాన్యత వీటికే ఇస్తామని, వీటిని పెద్ద అంబులెన్సులు అనుసరిస్తాయని తెలిపారు
Mon Jan 19, 2015 06:51 pm