పనజి: గోవా బడ్జెట్ సమావేశాలు ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ లేకుండానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అస్వస్థతకు గురైన పారికర్ ప్రస్తుతం ముంబై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా పారికర్ అసెంబ్లీ సమావేశాలకు రాలేని పక్షంలో ప్రభుత్వంలోని సీనియర్ మోస్ట్ సభ్యుడు సభలో బడ్జెట్ ప్రవేశపెడతారని డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో మీడియాకు తెలిపారు. ఈనెల 14న పారికర్ కడుపునొప్పితో గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్టిపల్లో హెల్త్ చెకప్ కోసం చేరారు. అక్కడి నుంచి తదుపరి పరీక్షల కోసం ఆయనను ముంబై తీసుకువెళ్లారు. కాగా, పారికర్ ఆరోగ్య కారణాల దృష్ట్యా బడ్జెట్ సమావేశాలను కుదించే విషయమై నిర్ణయం తీసుకునేందుకు అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సోమవారంనాడు సమావేశమవుతుందని లోబో చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm