పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం బయటపడి వారం కూడా గడవకముందే ప్రభుత్వం మరి కొన్ని ఆశ్చర్యకర గణాంకాలను విడుదల చేసింది.2012-16 మధ్య కొందరు వ్యక్తులు రూ.22,743 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించారని కేంద్ర సమాచార శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు.
భారతీయ బ్యాంకుల పరిస్థితిపై ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మేనేజ్మెంట్, బెంగళూరు కూడా ఒక నివేదికను విడుదల చేసింది. అందులోని గణాంకాలనే రవిశంకర్ ఉటంకించారు.
శుక్రవారం నాడు పార్లమెంటు క్వశ్చన్ అవర్లో మంత్రి మాట్లాడుతూ ఐఐఎం విడుదల చేసిన ఈ నివేదకను ప్రస్తావించారు.
2017 మొదటి తొమ్మిది నెలల్లో ఐసీఐసీఐ బ్యాంకులో దాదాపు 455, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 429, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో 244, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 237 మోసాల కేసులు బయటపడినట్లు ఆ నివేదిక చెబుతోంది.
ఈ అన్ని కేసులూ లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ మేర బ్యాంకులకు నష్టం వాటిల్లినవే. ఇలాంటి మోసాల్లో ఎక్కువ సార్లు బ్యాంకు ఉద్యోగుల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 09:07PM