హైదరాబాద్: ఇంటింటికీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దిన టీ-ఫైబర్గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్ (టీడీఎన్) ఈ రోజు ప్రారంభం కానున్నది. ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత ప్రపంచ ఐటీ కాంగ్రెస్కు హాజరయ్యే ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ ఈ పథకం గురించి వివరిస్తారు. పౌరసేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సాంకేతిక విప్లవాన్ని ఇంటింటికీ చేరవేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్గ్రిడ్ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్(టీడీఎన్) పేరుతో మహేశ్వరం,తుమ్మలూరు, మన్సాన్పల్లి,సింగూర్పూర్ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టును అమలుచేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm