హైదరాబాద్: హైదరాబాద్ ఏడో నిజాం వారసు డు ప్రిన్స్ ఫాజల్ ఝా బహదూర్ (72) హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బహదూర్ 1946 ఫిబ్రవరి 29న జన్మించారు. ఏడో నిజాం స్థాపించిన మతపరమైన అనేక ట్రస్టులకు ఇంచార్జిగా ఉన్నారు. ఇందులో సౌదీఅరేబియాలోని హైదరాబాద్ రూబత్ కూడా ఉన్నది. హైదరాబాద్ కింగ్కోఠిలోని మజీద్-ఈ-జుడిలో బహదూర్ అంత్యక్రియలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm