హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పోరాడితే దేవుడైనా దిగివస్తాడని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ తాము చేస్తున్న పోరాటానికి పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం బొమ్మూరులో పర్యటించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలన్నీ ఏకం కాకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు కేంద్రంపై తమ పోరాటం ఆగదని, రాజీనామాలకు తమకు చిటెకెలో పని అన్నారు. రాజీనామా లేఖలు జేబులో ఉంచుకునే తిరుగుతున్నామని పేర్కొన్న మురళీ మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల కోసమే ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడితే కేంద్రమే దిగివస్తుందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm