హైదరాబాద్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది. డాటా సైన్స్, కృత్రిమ మేధాశక్తి అంశాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు ఉందని నాస్కామ్ నివేదికలో వెల్లడించింది. అంకురాలకు ఆర్థిక వనరుల సమీకరణ మరింత పెరగాల్సి ఉంది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఈ ఏడాది కొత్తగా లక్ష ఉద్యోగాలు వచ్చాయి. వచ్చే ఏడాది మరో లక్ష ఉద్యోగాలకు అవకాశముంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్ రంగాల్లో వృద్ధి అధికంగా ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm