బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కుమారుడు మహమ్మద్ హ్యారీస్ నలపాడ్ పబ్లో ఓ వ్యక్తిపై దాడి చేసి కలకలం సృష్టించగా.. తాజాగా మరో కాంగ్రెస్ నేత ఏకంగా ప్రభుత్వం కార్యాలయంలో పెట్రోల్ చల్లి నిప్పు పెడతానంటూ వీరంగం సృష్టించాడు. కెఆర్ పురం కాంగ్రెస్ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్కు సన్నిహితుడైన కెఆర్పురం బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నారాయణస్వామి ఇటీవల హోరమావులోని బృహత్ బెంగళూరు మహానగర పాలిక వార్డు కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే భూములకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలంటూ అధికారులను బెదరించినట్టు చెబుతున్నారు. అయితే అవి నకిలీ డాక్యుమెంట్లు కావడంతో అధికారులు అందుకు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన నారాయణస్వామి తన వద్ద ఉన్న పెట్రోల్ను వార్డ్ కార్యాలయంలో చల్లి తగలబెడతానని హెచ్చరించారు. అసిస్టెంట్ రెవెన్యూ అధికారి చెంగల్ రాయప్పపై కూడా పెట్రోల్ చల్లాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం విడుదల కావడంతో సదరు కాంగ్రెస్ నేత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 20,2018 06:43PM