న్యూఢిల్లీ : కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు పొడిగించేందుకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ నెల చివర జరిగే కేంద్రకేబినెట్లో కేజీబీవీలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకాశ్జవదేకర్ స్పష్టమైన హామీనిచ్చారు. ఇవాళ కేంద్రమంత్రి ప్రకాశ్జవదేకర్ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ మల్లారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపర్చిన విద్యాసంస్థల ఏర్పాటు హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంటర్మీడియట్ వరకు యూనిఫామ్స్ అందించాలని కోరాం. హైదరాబాద్కు ఐఐఎం కేటాయించాలని కోరాం. కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ అమలు చేయడం వల్ల బాలికల డ్రాపవుట్లు తగ్గించడమే కాకుండా విద్యాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏపీకి మాదిరిగానే తెలంగాణకు ట్రిపుల్ ఐటీని కేటాయించాలని జవదేకర్ ను కోరినట్లు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm