- మహిళ రహస్య అవయవాలపై ఇనుప రాడ్తో దాడి, అత్యాచారం
న్యూఢిల్లీ: దేశంలోని యువతులపై సాముహిక అత్యాచారాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పశ్చిమ బెంగలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు ఓ గిరిజన మహిళపై సాముహిక అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు ఆమె రహస్య అవయవాల్లోకి ఇనుపరాడ్ను జొప్పించి, క్రూరంగా హింసించారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ పూర్ కుష్మండికి చెందిన 21 ఎండ్ల గిరిజన మహిళ స్థానిక సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అనంతరం ఆమెను సమీపంలో బ్రిడ్జ్ కిందకు తీసుకుపోయి, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అందులోని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా ఓ ఇనుపరాడ్ను ఆమె రహస్య అవయవాల్లోకి జొప్పించి రాక్షసానందం పొందాడు. ఆమె సాయం కోసం అరవడం విన్న స్థానికులు అక్కడకు పరుగు పరుగున రావడంతో నిందితుల అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు రాయ్గంజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమెను మాల్దా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ' ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను సీసీయూలో ఉంచాం. ఆపరేషన్ జరుగుతోంది. అంతర్గతంగా చాలా గాయాలయ్యాయి. వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. పలువురు సీనియర్ వైద్యులతో పాటు, గైనకాలజిస్ట్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు` అని మాల్దా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరోపక్క పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 20,2018 07:46PM