హైదరాబాద్: ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(టిఆర్టి) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల జారీని టిఎస్పిఎస్సి అధికారులు మంగళవారం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొనడంతో హాల్ టికెట్ల జారీని నిపిపి వేశామని అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు మార్పు చేసి మళ్లీ హాల్ టికెట్లు జారీ చేస్తామన్నారు. సవరించిన హాల్ టికెట్లను త్వరలోనే టిఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్లో పెడతామన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆప్లికేషన్లో నింపిన సమీప పరీక్ష కేంద్రాలనే అభ్యర్థులకు కేటాయిస్తామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm